లిక్కర్‌ స్కామ్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

లిక్కర్‌ స్కామ్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో శ్రవణ్‌రావు సిట్‌ విచారణకు గురువారం హాజరయ్యారు. దుబాయ్‌లో తన ఫ్లాట్‌లో లిక్కర్‌ కేసులో నిందితులైన చాణక్యతో పాటు మరికొంతమందికి ఆశ్రయం కల్పించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వివరాల కోసం సిట్‌ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అలాగే రాజ్‌కెసిరెడ్డితో ఉన్న సంబంధాలపై విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, శ్రవణ్‌రావు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు.