R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం

శ్రీశైలం జలాశయానికి  వరద ప్రవాహం తగ్గుముఖం

వర్షాలు తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీరు తగ్గింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఒక గేటు ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1,35,511 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,23,897 క్యూసెక్కులుగా నమోదైంది. పోతిరెడ్డిపాడు, ఎడమ గట్టు, కూడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.90 అడుగుల వరకు నీరు చేరింది. నిల్వ సామర్థ్యం 209.15 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.80 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi