Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పుణెలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

పుణెలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

పుణెలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

పుణె హింజెవాడిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న 23 ఏళ్ల యువ ఇంజినీర్ పీయూష్‌ కవాడే సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మీటింగ్‌లో ఉన్నప్పుడు అస్వస్థత తెలిపి బయటకు వెళ్లిన అతడు, భవనం ఏడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. "జీవితంలో విఫలమయ్యా, నన్ను క్షమించండి" అని కుటుంబానికి లేఖ రాశాడు. మానసిక ఒత్తిడే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news