R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కుమారులతో అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

కుమారులతో అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

కుమారులతో అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. చిన్న కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్‌ కోసం కాలేజీలో చేర్చించేందుకు పెద్ద కుమారుడు ఆదిత్యతో కలిసి శనివారం (ఆగస్ట్ 16) ఆమె అమెరికాకు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులు కవితకు వీడ్కోలు చెప్పారు. ఆమె 15 రోజుల పాటు అమెరికాలో ఉండి, సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.అమెరికా వెళ్లేముందు కవిత ఎర్రవల్లి ఫాం హౌస్‌కి వెళ్లి తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో ఆమె అమెరికాలో ఉన్న సమయంలో రాసిన లేఖ లీక్‌ కావడంతో ఈసారి పర్యటన తర్వాత రాజకీయంగా ఎలాంటి మార్పులు జరుగుతాయన్నదాని మీద ఉత్సుకత నెలకొంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi