R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాజా సింగ్‌: పిలిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తా!

రాజా సింగ్‌: పిలిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తా!

రాజా సింగ్‌: పిలిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తా!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీలోకి తిరిగి చేరబోనని తేల్చిచెప్పిన ఆయన, ఇప్పుడు పార్టీ పెద్దలు పిలిస్తే మళ్లీ చేరేందుకు సిద్ధమని వెల్లడించారు. వేరే పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని, ఇతర పార్టీలు తనకు సరిపోవని చెప్పారు. తనతోనే కొన్ని పొరపాట్లు జరిగాయని, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పార్టీలో తనకు శత్రువుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, అందుకే బీజేపీ తనను సస్పెండ్ చేసిందని వెల్లడించారు. ఫిర్యాదుల ఆధారంగా తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ నేతల ముందు జరిగిందంతా వివరించేందుకు సిద్ధమని తెలిపారు. గోషామహల్‌కు ఉపఎన్నిక అవసరం లేదని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఇంకా మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతానని రాజా సింగ్‌ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi