R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏడు నుంచి మూడు.. మాట మార్చిన ట్రంప్

ఏడు నుంచి మూడు.. మాట మార్చిన ట్రంప్

ఏడు నుంచి మూడు..  మాట మార్చిన ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లుగా తాను ఏడు యుద్ధాలు ఆపానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఆయన మాట మార్చి, మూడు యుద్ధాలు మాత్రమే ఆపానని అన్నారు. వాటిలో ఒకటి 31 ఏళ్లు, మరోది 34 ఏళ్లు, ఇంకోది 37 ఏళ్లు కొనసాగాయని, లక్షలాది ప్రాణాలు బలైపోయాయని తెలిపారు. అయితే ఆ యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయో స్పష్టంగా చెప్పలేదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తానే ఆపగలనని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఏడు యుద్ధాలు ఆపానని చెప్పి, ఇప్పుడు మూడు యుద్ధాలు అని చెప్పడం ట్రంప్ మాటలలో అస్పష్టతగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైట్‌హౌస్ ప్రకారం, ఆయన మధ్యవర్తిత్వం వల్ల థాయ్‌లాండ్-కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, రవాండా-కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా వంటి దేశాల మధ్య ఘర్షణలు తగ్గాయని పేర్కొంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ తరచూ చెబుతున్నా, భారత్ మాత్రం మూడో దేశం ప్రమేయం లేదని స్పష్టం చేస్తోంది

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi