R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు పెంపు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు పెంపు

సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను పెంచింది. రోజుకు 1.80 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.10 లక్షల టన్నుల రవాణా సాధించాలని నిర్ణయించింది.సీఎండీ ఎన్. బలరాం అన్ని ఏరియా జీఎంలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ, నాణ్యత పెంపు, వ్యయ నియంత్రణ, అనవసర ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఓవర్బర్డెన్ తొలగింపు, భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించారు.త్వరలో కొత్తగూడెం వీకే కోల్ మైన్, ఇల్లందు జేకే ఓసీ గనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఈ ఏడాదిలోనే 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, వచ్చే ఏడాది మరో 10 మిలియన్ టన్నులు పెరగనున్నట్లు పేర్కొన్నారు.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

