R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

స్త్రీశక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం

స్త్రీశక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం

స్త్రీశక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున ‘స్త్రీశక్తి’ పథకాన్ని విజయవాడలో ప్రారంభించారు.ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం, ఆలయ దర్శనం వంటి అవసరాల కోసం రాష్ట్రంలోని ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.చంద్రబాబు మాట్లాడుతూ – “స్త్రీశక్తి పథకం మహిళలకు ఆర్థికంగా మేలు చేస్తుంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి ఇంటికి నెలకు సగటున రూ.4000 వరకు ఆదా అవుతుందని అంచనా” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi