R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనుమతుల జాప్యం సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనుమతుల జాప్యం సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్లో భవనాల అనుమతుల జారీ ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ‘బిల్డ్ నౌ’ కింద అనుమతులపై సమీక్ష నిర్వహించిన ఆయన, కొంతమంది అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.ఈ జాప్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ కార్యదర్శికి ఆదేశించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.చెరువులు, నాలాలు, నీటి వనరులపై లైడార్ సర్వే తక్షణం చేపట్టి, వివాదాల్లేకుండా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. 🏗️
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

