R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్తో వాణిజ్య బంధాలు పెంచాలి: నిక్కీ హేలీ
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్తో వాణిజ్య బంధాలు పెంచాలి: నిక్కీ హేలీ

అమెరికా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ, భారత్ను ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంటూ, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, హేలీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాను ఎదుర్కొనే క్రమంలో భారత్తో సంబంధాలను బలపరచాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే అది వ్యూహాత్మకంగా తప్పు అవుతుందన్నారు. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై భారత్పై అదనపు టారిఫ్లు విధించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. చైనాతో వాణిజ్య విభేదాల నేపథ్యంలో, భారత్ అమెరికాకు కీలక భాగస్వామిగా మారుతుందని హేలీ స్పష్టం చేశారు.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi