A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైష్ణోదేవి యాత్రలో కొండచరియల ప్రమాదం – భక్తులు గాయాలపాలయ్యారు
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైష్ణోదేవి యాత్రలో కొండచరియల ప్రమాదం – భక్తులు గాయాలపాలయ్యారు

జమ్మూ కశ్మీర్ కత్రాలోని మాతా వైష్ణోదేవి పాత యాత్ర మార్గంలో బంగంగా సమీపంలో సోమవారం ఉదయం భారీ రాళ్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో పలు రాళ్లు దిగివచ్చి యాత్రికులపై పడటంతో కొంతమంది గాయపడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా, వెంటనే రెస్క్యూ టీమ్ స్పందించింది. శ్రైన్ బోర్డు సిబ్బంది, పోలీసుల సాయంతో నలుగురు భక్తులను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా దృష్ట్యా చర్యలు కఠినంగా తీసుకుంటున్నారు. అధికారిక సమాచారం వచ్చే వరకు భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi