L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బైక్‌పై వచ్చి పుస్తెల తాడు దోపిడీ

బైక్‌పై వచ్చి పుస్తెల తాడు దోపిడీ

బైక్‌పై వచ్చి పుస్తెల తాడు దోపిడీ

నగరంలో వరుసగా స్నాచింగ్‌ ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నాగోల్‌లో గౌరెల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు వీరమ్మ మెడలోని మంగళసూత్రాన్ని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి లాక్కొని పారిపోయారు. అలాగే ఉప్పల్‌ భగాయత్‌లో వాకింగ్‌కు వెళ్లిన మహిళను కర్రలతో బెదిరించి ఆభరణాలు దోచుకున్నారు. మరోవైపు కళ్యాణపురి టీచర్స్‌ కాలనీలో మహిళ పుస్తెల తాడును లాక్కొని నిందితులు తప్పించుకున్నారు. ఇటీవల కేపీహెచ్‌బీ, సరూర్‌నగర్, చంపాపేట్ ప్రాంతాల్లోనూ ఇలాంటి దోపిడీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్నాచింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad