K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేత
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేత

హైదరాబాద్లో జంట జలాశయాలకు భారీగా వరద చేరింది. ఉస్మాన్సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు 8 గేట్లు ఎత్తి 4,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్లోనూ నీటిమట్టం పెరగడంతో 3 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కుల నీటిని విడిచారు. వరద ఉధృతి పెరగడంతో మంచిరేవుల బ్రిడ్జి నీటమునిగింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేయబడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని అధికారులు సూచించారు.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi