Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నెల్లూరు జిల్లాలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చిన్న మంటలు ఆందోళనకు గురైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లాలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చిన్న మంటలు ఆందోళనకు గురైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లాలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చిన్న మంటలు ఆందోళనకు గురైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు సమీపంలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌ (12670) రైల్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చాప్రా నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఇంజిన్‌ వెనుక ఉన్న బోగీలో బ్రేక్ బైండింగ్ కారణంగా పొగలు కమ్మాయి. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో అరగంటలో రైలు తిరిగి ప్రయాణం కొనసాగించింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthicrime news